సాధారణంగా ప్రతి యేడాది నేపాల్లో వరినాట్ల వేడుకలను వ్యవసాయశాఖ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది కూడా నేపాల్లో ఈ వేడుకలను నిర్వహించగా, ఈ వేడుకలకు మంత్రి హరిప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతటితో ఆగని మంత్రి... ఈ వేడుకలకు హాజరైన ఓ మహిళను కౌగిలించుకున్నారు. ఆసమయంలో అక్కడే ఉన్న మీడియా మంత్రిగారి నిర్వాకాన్ని తమ కెమెరాల్లో క్లిక్మనిపించింది. ఈ ఫోటోలు కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో కనిపించాయి.
మహిళను కౌగిలించుకోవడం ఖచ్చితంగా లైంగిక వేధింపులేనని సామాజిక మాధ్యమాల్లో తివ్రమైన విమర్శలు వచ్చాయి. హరిప్రసాద్ వ్యవహారశైలిపై సొంత పార్టీ సీపీఎన్ - యూఎంఎల్ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయకతప్పలేదు. హరిప్రసాద్ రాజీనామాను ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల్లో ఆమోదించారు. పాపం.. హరిప్రసాద్.