పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న పిల్లలను, మగవారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా ఇళ్లలో వంట చేస్తున్న మహిళలను ఊచకోతకోస్తూ.. ఇళ్లను తగులబెట్టారు. మేలో మహమ్మద్ బుహారీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నైజీరియాలో ఇంతటి నరమేధం చోటు చేసుకోవడం ఇదే ప్రథమం.