ఖైబర్ జిల్లాలోని మేహర్బాన్ కలయ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో బహిరంగ శిక్ష విధించిన మిలిటెంట్లు సాయంత్రం వరకు మృతదేహాన్ని కదిలించవద్దని హుకుం జారీ చేసినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ ప్రాంతం తెహ్రీక్-ఇ-తాలిబాన్ నియంత్రణలో ఉన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.