పారిస్ చోటుచేసుకున్న మారణహోమానికి మహ్మద్ అబ్దెస్లామ్ సోదరులు బ్రహీమ్ అబ్దెస్లామ్, సాలాహా అబ్దెస్లామ్ కారకులైన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బ్రహీమ్ అబ్దెస్లామ్ హతమవ్వగా, సాలాహా అబ్దెస్లామ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సాలాహాను తక్షణం అరెస్టు చేయాలని సోదరుడు మహ్మద్ నుంచే డిమాండ్ రావడం గమనార్హం.
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో చోటుచేసుకున్న దాడులకు ప్రధాన కారణమైన తన సోదరుడిని అరెస్ట్ చేయాలని మహ్మద్ అబ్దెస్లామ్ డిమాండ్ చేశాడు. తన ఇద్దరు సోదరులు చేసిన పని వల్ల తమ కుటుంబం మొత్తం తలెత్తుకోలేకుండా ఉందన్నాడు. దాడులకు కొన్ని రోజుల ముందు తన ఇద్దరు సోదరులను చూశానని మహ్మద్ తెలిపాడు. పారిస్ దాడుల బాధితుల ఆవేదన తనకు తెలుసని, ఈ ఘటనపై తాము కూడా చాలా బాధపడుతున్నామని మహ్మద్ పేర్కొన్నాడు.