తన 16 ఏళ్ల ప్రాయంలో అమెరికా వెళ్ళిన ఆమె, న్యాయవిద్య అనంతరం 16 సంవత్సరాలుగా రిచమండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అటార్నీగా విధులు నిర్వహిస్తున్నారు. న్యాయశాస్త్రంతో పాటు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న ఆమె, తన తల్లి పద్మారామనాథన్ పేరిట ప్రారంభించిన డాన్స్ అకాడమీ తరపున అప్పుడప్పుడూ ప్రదర్శనలు కూడా ఇస్తూ మంచి పేరు కూడా సంపాదించుకున్నారు.