స్కాట్‌లాండ్ : సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజల ఓటు!

శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:32 IST)
స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో యునైటెడ్ కింగ్ డమ్‌లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది.
 
సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు వేశారు. దీంతో, 300 ఏళ్ల బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా ఇకపై కూడా కొనసాగనుంది.

వెబ్దునియా పై చదవండి