నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గన్నారం గంగాధర్ కోడలు సుప్రజ, ఆరు నెలల బాబు మెల్బోర్న్లోని కమ్మర్ బ్రోక్ సెన్సర్ స్ట్రీట్లో భర్త శ్రీనివాస్తో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్ మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య సుప్రజ, కుమారుడితో కలిసి అనుమానాస్పదంగా కన్నుమూసింది.
అయితే, ఉన్నట్టుండు తల్లీ కుమారుడు మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సుప్రజ తండ్రి ఫోన్ చేయగా.. మామ గంగాధర్ హుటాహుటిన ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు.