బలోచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనీ, పాకిస్తాన్ అక్కడి పౌరులను ఊచకోత కోస్తూ రాక్షసంగా ప్రవర్తిస్తోందనీ, తక్షణం పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోనట్లయితే ఆ దేశం పట్ల తాము అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశంతో ఉన్న ఆర్థిక, రాజకీయ ద్వైపాక్షిక సంబంధాలపై పునఃసమీక్షించుకుని తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
జెనీవాలో బలోచిస్తాన్ స్వతంత్ర సమరయోధులు చేస్తున్న ధర్నాకు యూఎఇ ఉపాధ్యక్షులు మద్దతు పలకడం పాకిస్తాన్ కు మింగుడుపడటం లేదు. మరోవైపు భారతదేశం బలోచిస్తాన్ నేతలకు ఆశ్రయం కల్పించేందుకు ఆసక్తి చూపించడం పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఐతే పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషించడాన్ని ఇకనైనా ఆపకుంటే దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే హెచ్చరికలు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నాయి.