న్యూయార్క్ నుంచి ఇస్లామాబాద్కు తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో లండన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. "కాశ్మీర్లో ప్రజలపై భారత్ పాల్పడుతున్న హింసపై స్పందించిన బాధితుల బంధుగణం యూరీపై దాడి చేసింది. మరణించిన, చూపు కోల్పోయిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి ఆగ్రహమే యూరీ దాడి. ఇండియా మాత్రం విచారణ జరపకుండానే పాకిస్థాన్ పై నిందలేస్తోంది. ఇది బాధ్యతారాహిత్యం. దాటి జరిగిన గంటల్లోనే అది పాకిస్థాన్ పనేనని ఎలా చెబుతారు?" అంటూ నవాజ్ ప్రశ్నించారు.