న్యూజిలాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నందగిరినగర్కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (26) మరణించాడు. సంతోష్ కుమార్ మరణవార్త అతని స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు చేరింది. రెండురోజుల్లో మృతదేహాన్ని విశాఖపట్నంకు పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు, అక్కడి తెలుగు సంఘం హామీ ఇచ్చింది. రెండు రోజులు పూర్తైన కూడా మృతదేహం ఇంటికి చేరకపోవడంతో సంతోష్కుమార్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.