నిజమే మా వద్ద 30 లేదా 40 వేల మంది టెర్రరిస్టులు ఉన్నారు : ఇమ్రాన్ ఖాన్

బుధవారం, 24 జులై 2019 (17:38 IST)
తమ భూభాగంలో 30 లేదా 40 వేల మంది టెర్రిరిస్టులు ఉన్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. వీరంతా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ ఆయన స్వయంగా అంగీకరించారు. 
 
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ పీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇమ్రాన్ మాట్లాడుతూ, దాదాపు 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు వారిని ఏరిపారేయాలనుకున్నట్లు చెప్పారు. 40 వేలకు పైగా ఉన్న ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబా, లష్కరే ఉమర్, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ప్రధాన సంస్థలకు చెందిన వారు ఉన్నట్టు తెలిపారు. 
 
పాకిస్థాన్‌లోని ఆర్మీ అధ్వర్యంలోని సైనిక పాఠశాలలో ఉగ్రవాదుల దాడుల ఫలితంగా 150మంది చిన్నారులు చనిపోయారనీ, అప్పటి నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ముంబై పేలుళ్ళ సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
 
అమెరికా వంటి అగ్రదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ శాంతి కోరుకుంటుందని తామే స్వయంగా ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వీటికి అమెరికా మాత్రం తాము ఎటువంటి సహాయం చేయాలన్నా.. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తేనే తాము ముందుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు