ఐపీఎల్-4: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో భాగంగా శనివారం డెక్కన్ ఛార్జర్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రెండో ట్వంటీ-20 మ్యాచ్ సమరం ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

జట్టు వివరాలు
డెక్కన్ ఛార్జర్స్: సంగక్కర (కెప్టెన్), ఆశిష్ రెడ్డి, ఆనంద్ రాజన్, అంకిత్ శర్మ, బంద్రీ, చిప్లీ, క్రిస్టియన్, దేవ్‌ధర్, ధావన్, డుమిని, గోనీ, హర్మీత్ సింగ్, జగ్గి, లంబ్, లిన్, మల్హోత్రా, మిశ్రా, ఓజా, పీటర్సన్, రవితేజ, జేఎన్ షా, ఇషాంత్ శర్మ, స్టెయిన్, థెరాన్, వైట్, యాదవ్.

రాజస్థాన్ రాయల్స్: షేన్ వార్న్, అమిత్ సింగ్, అస్నోద్కర్, బిన్నీ, బోథా, ఛావన్, చోప్రో, డోలె. దోషి, రాహుల్ ద్రావిడ్. ఫల్లా, ఫజ్జాల్, మెనారియా. నార్వెల్, ఓరమ్, పంకజ్ సింగ్, పౌనీకర్, రహానే, రౌత్, సలుంఖే, షా, టైట్, టైలర్, త్రివేది. వాట్సన్, యాగ్నిక్.

వెబ్దునియా పై చదవండి