ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో భాగంగా శనివారం డెక్కన్ ఛార్జర్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రెండో ట్వంటీ-20 మ్యాచ్ సమరం ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది.