సూపర్ ఓవర్లో పంజాబ్ అదిరిపోయేలా ఆడింది. మోరిస్ వేసిన తొలి బంతికి మిల్లర్ అవుట్ కాగా, రెండో బంతికి మ్యాక్స్వెల్ సింగిల్ తీశాడు. తర్వాత వరుసగా మూడు బంతులకు మార్ష్ మూడు ఫోర్లు కొట్టాడు. ఇందులో ఒకటి నోబాల్. ఇక చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగే రావడంతో పాటు మార్ష్ రనౌటయ్యాడు. దీంతో పంజాబ్ మొత్తం 15 పరుగులు చేసింది.
అలాగే సూపర్ ఓవర్లో రాజస్థాన్ 16 పరుగుల విజయలక్ష్యంతో రాజస్తాన్ బరిలోకి దిగింది. జాన్సన్ వేసిన తొలి బంతికి వాట్సన్ బౌల్డయ్యాడు. తర్వాతి బంతికి స్మిత్ ఫోర్ కొట్టినా. అది నోబాల్ కావడంతో మొత్తం 5 పరుగులు వచ్చాయి. తర్వాతి బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి ఫాల్క్నర్ అనూహ్యంగా రనౌట్కావడంతో రాజస్తాన్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓడింది. దీంతో పంజాబ్ గెలిచింది.