భారతీయ మార్కెట్లోకి ఈ ఏడాది భారీ కొత్త మోడల్ ఫోన్లు రానున్నాయి. జియామి, ఆసుస్, మోటొరోలా, ఒబి తదితర మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లో తమ మార్కెట్ షేర్ పెంచుకోవాలనుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో దాదాపు 1,400 నుంచి 1,500 కొత్త మోడల్స్ రాబోతున్నాయట.
"2015లో మేము 1,400 నుంచి 1,500ల ఫోన్లను విడుదల చేయాలని అనుకుంటున్నామని గతేడాది కన్నా ఈ ఏడాది 20 శాతం మోడల్స్ పెరగనున్నాయి" అని 91 మొబైల్స్డాట్ కామ్ తెలిపింది. గతేడాది మొత్తం 1,137 ఫోన్లను లాంఛ్ చేశారు.