రిలయన్స్ జియోకు ధీటుగా భారీ ఆకర్షణీయ పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ.4 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్ను అందించేందుకు సన్నాహాలు జరుపుతోంది. ఇప్పటికే చైనాకు చెందిన పలు సంస్థలతో సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్ టెల్ మాట్లాడిందట. వీలైనంత త్వరలో తన 4జీ ప్లాన్లను విడుదల చేసేందుకు ఎయిర్ టెల్ రంగం సిద్ధం చేసుకుంటోంది.