ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచర్.. ఎందుకు.. ఎవరి కోసం?

సోమవారం, 11 జులై 2016 (09:31 IST)
ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లాభాపేక్ష లేని ఛారిటీ సంస్థలకు సాయపడేందుకు ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా విరాళాలను ఆన్‌లైన్‌లో పొందేందుకు వీలుపడుతుందని ఆ సంస్థ పేర్కొంది.
 
ఈ అధునాతన ఫీచ్‌ర్‌ను అమెరికాలోని చారిటీ సంస్థలతో పాటు ఇకమీదట వ్యక్తిగత యూజర్లు సైతం వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫండ్‌రైజర్స్ ఫీచర్ అమెరికాలోని ఒక శాతం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందిని, వచ్చే కొద్దివారాల్లో మొత్తం యుఎస్ యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తామన్నారు.
 
ఎన్‌జీఓలు నేరుగా ఫేస్‌బుక్‌ నుంచి విరాళాలు పొందవచ్చని సంస్థ ప్రొడక్ట్ మేనేజిమెంట్ ఫర్ట్ సోషల్ గుడ్ వైస్‌ ప్రెసిడెంట్ నవోమి గ్లెయిట్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజా ఫీచర్‌తో యూజర్లు నేరుగా ఫేస్‌బుక్‌ ద్వారా డొనేషన్లు ఇవ్వవచ్చు.

వెబ్దునియా పై చదవండి