ఐబాల్ సంస్థ 'యాండీ 5ఎన్ డ్యూడ్' పేరిట సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ను ఆ కంపెనీ వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే, ఫోన్ల అందుబాటుకు సంబంధించి ఒక్క పదం కూడా ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. కాగా, ఈ డబుల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 4.4 కిట్కాట్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గత నెలలో ఈ కంపెనీ యాండీ బ్లింక్ 4జి స్మార్ట్ ఫోనును పరిచయం చేసింది. ఇది ఆండ్రాయిడ్ 6.0 ఫీచర్తో పని చేసేలా రూపొందించింది. దీని ధర రూ.6,299 కాగా, ఇపుడు మార్కెట్లోకి విడుదల చేసి యాండీ 5ఎన్ డ్యూడ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.4,099గా మాత్రమే నిర్ణయించింది.
512 ఎంబీ ర్యామ్, మాలి 400 గ్రాఫిక్స్
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
3జీ, యూఎస్బీ ఓటీజీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ