గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్పై అమెరికాలో అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల వీటిపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వాషింగ్టన్ కోర్టుకు హాజరైన మైక్రోసాఫ్ట్ సీఈవో గూగుల్కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. ఆల్ఫాబెట్కు వ్యతిరేకంగా ఉన్న ప్రధాన కేసు గూగుల్ సెర్చ్ ఇంజిన్. వినియోగదారులకు నష్టం కలిగించిన పోటీ, ఆవిష్కరణలను అణిచివేసేందుకు గూగుల్ చర్యలు చేపట్టిందనేది ప్రధాన ఆరోపణ.
తమ సెర్చ్ ఇంజిన్ను డిఫాల్ట్ బ్రౌజర్గా ఉంచేందుకు స్మార్ట్ఫోన్, కంప్యూటర్ తయారీదారులతో గూగుల్ ఒప్పందాలు కుదుర్చుకుందని, అందుకే ఆధిపత్యం చెలాయిస్తోందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. కానీ ఈ వాదనలను Google తరపున న్యాయవాదులు తిరస్కరించారు.
యూఎస్ జిల్లా జడ్జి అమిత్ మెహతా గత నాలుగు వారాలుగా గూగుల్పై యాంటీ ట్రస్ట్కు సంబంధించిన కేసులను విచారిస్తున్నారు. సెర్చ్ ఇంజన్ విషయంలో ఆపిల్, ఇతర స్మార్ట్ఫోన్ తయారీదారులతో గూగుల్ చేసుకున్న ఒప్పందాల చుట్టూ ఈ పరిశోధన జరుగుతోంది. ఇప్పటికే పలువురు కోర్టుకు హాజరయ్యారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా వాదనలు వినిపించారు.