రానున్న ఐదేళ్లలో ఐటీ ఎగుమతులకు సంబంధించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి ఎగబాకనుందని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.65వేల కోట్ల మేర ఉండగా, విభజన తర్వాత ఏపీలో ఐటీ ఎగుమతులు రూ.1,700 కోట్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన చెప్పారు.