రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు చుక్కలు చూపుతున్నాయి. జియో నుంచి ఇతర టెలికాం నెట్వర్క్లకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కాల్ డ్రాప్ అవుతున్నాయి. దీంతో జియో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 10 రోజుల్లోనే జియో కస్టమర్లు 52 కోట్ల కాల్స్ ఫెయిలయ్యాయి. ఇది రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బవంటిది.
కాల్ డ్రాప్స్ విషయంలో ఎయిర్టెల్పైనే రిలయన్స్ జియో ప్రధానంగా ఆరోపిస్తోంది. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పలేక జియో నానా అవస్థలు పడుతోంది. జియో వినియోగదారులు ఒక్క వొడాఫోన్ నెట్వర్క్కే ఈ 10 రోజుల్లో 52 కోట్ల కాల్స్ ఫెయిలయినట్లు తెలిసింది. జియో నుంచి వొడాఫోన్కు 100 కాల్స్ చేస్తుంటే అందులో 80 కాల్స్ ఫెయినట్లు తేలింది.