మరోవైపు కొత్తగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీకి కూడా ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా అంగీకరించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అభ్యర్థనలన్నిటినీ పక్కనపడేశారంటూ వినియోగదారులు మండిపడుతున్నారు. దీనిపై జియో కూడా అసహనం వ్యక్తం చేసింది. వినియోగదారులు అడిగినప్పుడు చట్ట ప్రకారం మార్చాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ మూడు సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం తొక్కిపడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ట్రాయ్ జోక్యం చేసుకోవాలని జియో కోరుతోంది. అంతేకాదు... జియో సిమ్ వాడుతున్నవారి ఫోన్లకు ఇతర నెంబర్లు కనెక్టివిటీ ఉండటం లేదనీ, అలాగే వైఫై కూడా లేకుండా చేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై రిలయన్స్ జియో ఆయా కంపెనీలకు వివరణ అడుగుతోంది. ఐతే ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు మాత్రం అలాంటి సమస్యలేమీ లేవని చెపుతున్నాయి.