Reliance launches JioBook.. స్పెసిఫికేషన్స్ ఇవే

శుక్రవారం, 21 అక్టోబరు 2022 (13:11 IST)
దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. ల్యాప్ టాప్ రంగంలో మరో సంచలనానికి తెరతీసింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2022 ఈవెంట్‌‌లో జియో తన తొలి ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. ఈ ల్యాప్‌టాప్‌కు జియోబుక్ అని పేరు కూడా పెట్టింది. ఈ ల్యాప్ టాప్ ధర రూ.15,799గా నిర్ణయించింది. 
 
బడ్జెట్ ధరలో ఈ ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ల్యాప్ టాప్ బాగా పనిచేస్తుంది. జియోఓఎస్ ఆధారిత జియోబుక్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌కు యాక్సెస్ వుంటుంది. ఎంబెడెడ్ జియో సిమ్ కార్డు.. 5జీ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుంది. 
 
స్పెసిఫికేన్స్..
ఆండ్రెనో 610 జీపీయూ స్నాప్‌డ్రాగన్ 665 ఎస్ఓసీ ప్రాసెసర్ 
2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 
2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
11.6 అంగుళాల డిస్ ప్లే 
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 
యూఎస్‌బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ సపోర్ట్ 
1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఇది పనిచేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు