శాంసంగ్ కంపెనీ తన నిజాయితీని చాటుకుంది. తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవ్వరూ వాడొద్దని, వాటిని స్విచ్ఛాప్ చేసేయాలని సదరు సంస్థ బహిర్గతంగా ప్రకటించింది. ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా.. మార్చుకున్నది ఉన్నా.. దాన్ని వెంటనే స్విచ్ఛాప్ చేసేయండి అంటూ ఓ ప్రకటనలో తెలిపింది.
మార్చుకున్న ఫోన్లు కూడా పేలుతున్నట్లు సమాచారం రావడంతో మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోకుండా.. వెంటనే వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని శామ్సంగ్ నిర్ణయించింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను నిలిపివేశాయి.
అసలు సమస్య బ్యాటరీలో ఉందని భావించి, వెంటనే బ్యాటరీలు మార్చి ఇచ్చినా కూడా మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ ఏం చేద్దామా అంటూ యోచనలో పడింది. గత రెండు నెలల్లో శాంసంగ్ తన ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ఇది రెండో సారి. యాపిల్ ఐఫోన్కు దీటుగా ఉండేలా ఈ ఫోన్ను ఆగస్టు నెలలో శాంసంగ్ కంపెనీ మార్కెట్లలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.