ఈ కెమేరాతో చిమ్మచీకట్లోనూ వీడియో తీయొచ్చు... వివరాలేంటి?

బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:08 IST)
చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత మార్కెట్‌లో వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖంగా మొబైల్ రంగంలో అరంగ్రేటం చేసి అనతికాలంలోనే అగ్రగామి స్థాయికి చేరింది. మొబైళ్లు, పురుషుల షూలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, స్మార్ట్‌వాచీలు మొదలైన వాటిని ఇప్పటికే షియోమీ బ్రాండ్‌ తీసుకొచ్చింది. 
 
వాటితో పాటుగా ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ 1080పి నేడు భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కెమెరా ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అందులోని ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ ఫీచర్‌తో 10 మీటర్ల దూరంలో చీకటిలో ఉన్న దృశ్యాలను కూడా రికార్డ్ చేస్తుంది. 
 
ఈ కెమెరా 130 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. వైఫై సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ధరను రూ.2,699గా నిర్ణయించారు. ఈ కెమెరా రేపటి నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు