అన్నం తినే వేళలు సరిగ్గా పాటిస్తే పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఎనర్జిటిక్గా ఉంటారు. ఒకేసారి పిల్లలకు ఎక్కువ అన్నం పెట్టేయకుండా మితంగా పెట్టాలి. పిల్లవాని బొజ్జలో ఒక దఫా 250 ఎంఎల్ కన్నా మించి ఎక్కువ ఆహారం పోదు.
పోషకాహారం పుష్కలంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. ఇలా చేస్తే పోషకాహార లోపం రాదు. చికెన్, డ్రైఫ్రూట్స్, మిల్క్ షేక్స్, నట్ హల్వా, నువ్వుల లడ్డు, పీ నట్స్ చల్లిన, వెన్న పూసిన చపాతీలు, ఎగ్ ఆమ్లెట్ కలిపిన చపాతీలు, దోసె వంటివి పిల్లలకు పెట్టాలి.
పిల్లలకు అన్నం కలిపి పెట్టొద్దు. వారికి వారే ఆహారం కలుపుకుని తినేట్టు అలవాటు చేయాలి. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, పిజ్జాలాంటివి తినొద్దని కట్టడి చేయకండి. అదే సమయంలో చాక్లెట్తో పాటు ఒక పండు కూడా పిల్లలచేత తినిపిస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.