ముంబై సమీపంలో ఫయాన్ తుఫాన్ తీరాన్ని దాటింది. దీంతో తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారిందని, ప్రస్తుతం ఇది దక్షిణ గుజరాత్-ఉత్తర మహారాష్ట్ర సరిహద్దు భూభాగంపై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఫయాన్ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారడంతో గుజరాత్, మహారాష్ట్రలతోపాటు గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.