తనపై వచ్చిన అవినీతి ఆరోపణల వెనుక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దుమాల్ హస్తం ఉందని కేంద్రం ఉక్కు శాఖామంత్రి వీరభద్రా సింగ్ ఆరోపించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన విడుదలైన సీడీలను ముఖ్యమంత్రే బహిర్గతం చేశారని ఆయన శుక్రవారం ధ్వజమెత్తారు.
ఈ కుట్ర వెనుక ప్రేమ్ కుమార్ ధుమాల్ ఉన్నారు. అలాగే, మరో వ్యక్తికూడా ఉన్నారని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా, 23 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ఇపుడు తెరపైకి రావడం ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వీరభద్రా సింగ్ రాజకీయ సలహాదారునిగా ఉన్న విజై సింగ్ మంకోటియా గత యేడాది విడుదల చేశాడు. ఇందులో లావాదేవీలకు సంబంధించి వీరభద్రా సింగ్, ఆయన సతీమణి ప్రతిభా సింగ్ సంభాషణలు ఉండటంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు గత సోమవారం కేసు నమోదు చేశారు.