అహింస గురించి ఇండియన్స్‌కు చెప్పేదేముంది: దలైలామా

అహింస, ఆధ్యాత్మికత గురించి భారతీయులకు చెప్పడానికి తన వద్ద ఏమీ లేదని టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా వ్యాఖ్యానించారు. అహింస, ఆధ్యాత్మికత గురించి భారతీయులకు కనీసం రెండు వేల సంవత్సరాల నుంచి తెలుసునని దలైలామా పేర్కొన్నారు.

శతాబ్దాల తరబడి సంప్రదాయంగా వస్తున్న అహింసా ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో భారతీయ యువత కీలక పాత్ర పోషించాలని, ఈ ధర్మాన్ని, విలువలను బయటి ప్రపంచానికి వ్యాపింప చేయాలని దలైలామా పిలుపునిచ్చారు.

రాష్టప్రతి ఆర్.వెంకట్రామన్ శత జయంతిని పురస్కరించుకుని ఇక్కడి నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దలైలామా మాట్లాడుతూ.. భారత దేశ ప్రజాస్వామిక సంప్రదాయాలను యువత పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి