అహ్మదాబాద్‌లో 10 క్రూడ్ బాంబులు : ఒకరి అరెస్టు

ఆదివారం, 17 జులై 2011 (16:44 IST)
గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ఆదివారం పది క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒకరిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ ఎస్కే.సిన్హా మాట్లాడుతూ పది క్రూడ్ బాంబులను గుర్తించిన స్వాధీనం చేసుకున్న తర్వాత దనిలిండా అనే ప్రాంతానికి చెందిన షాహజద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

పోలీసుల రోజు వారీ తనిఖీల్లో భాగంగా ఒక ఇంటిలో తనిఖీలు చేపట్టగా క్రూడ్ బాంబులను కనిపెట్టినట్టు చెప్పారు. ఆ ఇంటి నుంచి మరికొంత పేలుడు ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి