ఐరాస ప్రపంచ పర్యాటక సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యం: చిరు

శనివారం, 10 నవంబరు 2012 (10:58 IST)
FILE
2013 లో జరిగే ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక ప్రాంతీయ సమావేశానికి హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తుందని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ప్రకటించారు. అలాగే వరంగల్ జరుగుతున్న కాకతీయ ఉత్సవాలకు నిధులు మంజూరుకు సంబంధించి ఎలాంటి విజ్ఞాపన రాలేదని చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు తనకు తానుగానే 25 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు పర్యాటక మంత్రి తెలిపారు.

పర్యాటక రంగం సరి కొత్తరూపాన్ని సంతరించుకునే తీరులో ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చిరంజీవి వెల్లడించారు. ఇప్పటి వరకూ విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవటానికి పట్టణ ప్రాంతాలపైనే దృష్టిని కేంద్రీకరించగా ఇక నుంచి గ్రామీణ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చిరంజీవి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి