ఒబామా- మన్మోహన్‌ల భేటీ: ద్వైపాక్షిక అంశాలపై చర్చ

FILE
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో కీలక ఘట్టం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటన చేపట్టిన బరాక్ ఒబామా ఇండో-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో సోమవారం హైదరాబాద్ హోస్‌లో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్- ఒబామాల మధ్య తీవ్రవాదం, న్యూక్లియర్, అవుట్‌సోర్సింగ్‌పై అమెరికా వైఖరి వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఈ భేటీలో ఒబామా, మన్మోహన్ సింగ్‌లతో పాటు దేశ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోంమంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి ఆంటోనీ, విదేశాంగ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు.

ఆప్ఘనిస్థాన్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు పాకిస్థాన్ మైత్రి అవసరమని భావిస్తున్న ఒబామా, భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు అవసరమనే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.

బరాక్ ఒబామాతో విదేశీ గడ్డపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదుసార్లు భేటీ కాగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత గడ్డపై తొలిసారి భేటీ కావడం ఇదే మొదటిసారి.

వెబ్దునియా పై చదవండి