జాతిపిత బిరుదును ప్రభుత్వం ఇచ్చింది కాదు : కేంద్రం హోం

గురువారం, 12 జులై 2012 (12:12 IST)
File
FILE
మహాత్మా గాంధీకి జాతిపిత బిరుదును కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది కాదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. సమాచారం హక్కు చట్టం కింద అభిషేక్ కడ్యన్ అనే సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు డైరక్టర్ అండ్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐఓ) శ్యామలా మోహన్ సమాధానం ఇచ్చారు.

ఈ మేరకు ఆమె గత నెల 18వ తేదీన కడ్యన్‌కు ఇచ్చిన లిఖత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. మహాత్మా గాంధీకి జాతిపిత అనే బిరుదు బహుళ ప్రాచూర్యం పొందినప్పటికీ... అలాంటి బిరుదును కేంద్ర ప్రభుత్వం అధికారంగా ప్రదానం చేయంలేదని స్పష్టం చేశారు.

గతంలో కూడా జాతిపిత అనే బిరుదు తాలూకూ ఆర్డర్ ఫోటో కాపీ కావాలని లక్నోకు చెందిన ఐశ్వర్య పరాశర్ అనే ఆరో తరగతి విద్యార్థిని సమర్పించిన దరఖాస్తులోనూ ఇదే తరహా సమాధానం వచ్చింది. అలాంటి పత్రమేదీ నేషనల్ ఆర్కైవ్స్‌ ఆఫ్ ఇండియాలో లేదని జవాబు ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి