దేశంలో మరో 16 కొత్త స్వైన్ ఫ్లూ కేసులు

బుధవారం, 5 ఆగస్టు 2009 (13:10 IST)
దేశంలో మరో 16 స్వైన్ ఫ్లూ కేసులు బుధవారం కొత్తగా వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 574కు చేరుకుంది. కాగా, కొత్తగా వెలుగు చూసిన ఆరు కేసుల్లో మూడు దేశ రాజధాని ఢిల్లీలో నమోదు కాగా, పూణెలో 16 కేసులు, ముంబైలో రెండు, చెన్నై, గుర్గాన్, త్రివేండ్రం‌లలో ఒక్కో కేసు చొప్పున ఉంది.

ఢిల్లీలో బయటపడిన మూడు కేసుల్లో ఒకరు హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన 22 సంవత్సరాల వ్యక్తి. అలాగే మిగిలిన రెండు కేసుల్లో ఒకరు సింగపూర్ నుంచి, మరొకరు కౌలాలంపూర్‌ నుంచి వచ్చిన వ్యక్తులు. రెండో కేసు 18 సంవత్సరాల యువకుడికి సోకగా, మరో కేసు 25 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. అలాగే పూణెను సందర్శించిన 20 సంవత్సరాల యువకుడికి ఈ వ్యాధి సోకింది.

వెబ్దునియా పై చదవండి