ప్రత్యేక రాష్ట్రంగా ముంబైని ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై క్షమాపణ అడిగే ప్రసక్తే లేదని ప్రముఖ రచయిత్రి శోభా డే గురువారం స్పష్టం చేశారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరుచేయాలని తాను సూచించలేదని, ట్విట్టర్లో తాను పొందుపర్చిన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా క్షమాపణలు చెప్పాలని పట్టుబడితే పట్టించుకోనంటూ వ్యంగంగా మాట్లాడారు.
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ సరదాగా చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందిస్తారని ఊహించలేదని, దిన పత్రికల్లో విషయం చూసి అవాక్కయ్యానన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించలేదని, తానెవరినీ బాధపెట్టలేదని, దీంతో క్షమాపణ అడిగే ప్రశ్నే తలెత్తేలేదని ఆమె తేల్చి చెప్పారు.