మంగుళూరులో 11 మంది అనుమానితుల అరెస్టు

మంగుళూరులో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భారీ పేలుళ్ళకు కుట్ర పన్నినట్టు వారివద్ద జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరి నుంచి టైమ్ బాంబులతో పాటు.. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీడీలు, ప్రధాన ఆలయాలు, భవంతుల చిత్రాలు కూడా ఉన్నాయి.

యాంటీ నక్సల్‌ దళం, ముంబై, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఉల్లల్ సమీపంలో తెల్లవారుజామున 2.30 సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురుని అరెస్టు చేశారు. వారిలో ఒకరు తీవ్రవాదిగా భావిస్తున్నారు.

అరెస్టు చేసిన వారంతా ఉల్లాల్‌ ముక్కాచ్చేరి, తొక్కాట్టు లోని చెంబుగుడ్డే, మంగుళూరులోని పండేశ్వర్, మల్కీ సమీపంలోని హలీయాంగడి ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరివద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరంతా ఇంటర్నెట్‌ ద్వారా సమాచారాన్ని పరస్పర బదలాయింపు చేసుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి