మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆస్తుల విలువ రూ.1,35,44,514

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఆస్తులు వివరాలను అసెంబ్లీ ముందుంచారు. చౌహాన్ తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా సభకు తెలియజేసారు. ఆయన సమర్పించిన పత్రాల ప్రకారం భార్య ఆస్తులతో కలిపి ముఖ్యమంత్రి ఆస్తుల విలువ రూ.1,35,44,514లు అని తెలియవచ్చింది.

ఇంకా ఎమ్మెల్యే కాంప్లెక్స్‌లో చౌహాన్‌కు రూ.23 లక్షల విలువై అపార్ట్ మెంట్ ఉంది. జాతీయ పొదుపు సర్ట్ఫికెట్లు రూ.60వేల విలువైనవని, 64 గ్రాముల బంగారం ఆభరణాలున్నాయి. మరో 60 వేల నేషనల్ సేవింగ్ సర్ట్ఫికెట్లున్నాయి.

వీటితోపాటు ఇంట్లో సామాన్ల విలువ రూ.2 లక్షల మేర ఉంటుందని ఆయన తన ఆస్తుల పత్రంలో తెలిపారు. మరో పదిలక్షల నగదు, విదిషలోఇల్లు, బ్యాంకులో రూ.10లక్షల నగదు ఉన్నాయని సభాముఖంగా చౌహాన్ తన ఆస్తి వివరాలను తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి