మార్పు కోరుతున్న గుజరాత్ : లాలూ

సోమవారం, 10 డిశెంబరు 2007 (10:23 IST)
గుజరాత్ రాష్ట్ర ప్రజలు అధికార మార్పిడిని కోరుకుంటున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలకు పీడకలగా మిగిలిపోయిన 2002నాటి 'ఆపరేషన్ కళంక్‌'కు ఆ రాష్ట్రముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ (భాజపా) బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.

పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన లాలూప్రసాద్ యాదవ్ కుటుంబసమేతంగా ఆదివారం తిరుమలేశుని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు భాజపాకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తద్వారా మతవాదాన్ని మట్టుబెట్టి లౌకికవాదానికి పట్టం కడతారని లాలూ జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి