రూపాయికే కిలో బియ్యం: ఆంధ్రప్రదేశ్‌ను అనుసరిస్తున్న కేంద్రం

సోమవారం, 7 నవంబరు 2011 (22:11 IST)
PTI
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని యూపీఎ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇక నుంచి దేశవ్యాప్తంగా రూపాయికే కిలో బియ్యం అందేటట్లు ఆహారబిల్లు భద్రత ముసాయిదా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఓకే చేసింది. ఇతర ధాన్యాలను రూ. 2 అందేటట్లు చూడాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఈ పథకాన్ని అక్కడి నుంచి ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆహారద్రవ్యోల్బణం చుక్కలు చూస్తుండటంతో ధరలు అదుపు తప్పాయి. సామాన్యుడికి మోయలేని భారంగా మారిన నిత్యావసర వస్తు ధరలను ఈ పథకంతో నిలువరించాలని కేంద్రం భావిస్తున్నది.

ఇప్పటికే రూపాయికే కిలో బియ్యం పథకం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాహుల్ గాంధీ సంప్రదించినట్లు సమాచారం. మొత్తమ్మీద ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రూపాయికే కిలో బియ్యం పథకంతో కాంగ్రెస్ పార్టీ వెళ్లనుంది.

వెబ్దునియా పై చదవండి