విభజన మొదలైంది: తెలంగాణపై చిదంబరం ప్రకటన

FILE
తెలంగాణపై ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ముఖ్య అంశాలు, ప్రక్రియతో కూడిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం నిర్ణయం కోసం కేంద్ర హోంశాఖ ప్రతిపాదిస్తుంది అని ఆర్థిక మంత్రి పి చిదంబరం రాజ్యసభలో ప్రకటించారు.

రాజ్యసభ మొదట రెండుసార్లు వాయిదా పడిన తరువాత సాయంత్రం మూడు గంటలకు సమావేశమైనప్పుడు చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారు.

నదీ జలాల పంపిణీ, విద్యుదుత్పాదన, పంపిణీ, అన్ని ప్రాంతాల ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల భద్రత సహా పలు ఇతర అంశాలతో హోం శాఖ ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తోందని చిదంబరం వివరించారు.

వెబ్దునియా పై చదవండి