సరాదాగా వ్యాఖ్యానించా.. నేనెందుకు క్షమాపణ ఎందుకు చెప్పాలి?

FILE
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ముంబైని మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు ప్రకటించకూడదన్న ప్రముఖ రచయిత్రి, పత్రికా రచయిత శోభా డే ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె క్షమాపణ చెప్పాలని ఆందోళన చేస్తున్నారు.

అయితే ఆమె మాత్రం క్షమాపణలు చెప్పేందుకు ససేమీరా అంటున్నారు. తాను సరదాగా చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందిస్తారనుకోలేదన్నారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేయాలని తాను సూచించలేదని, ట్విట్టర్‌లో తాను పొందుపర్చిన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా క్షమాపణలు చెప్పాలని పట్టుబడితే పట్టించుకోనన్నారు.

కాగా శోభా వ్యాఖ్యలపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమె మద్యం మత్తులో మాట్లాడుతోందని మండిపడ్డారు. ఆమెను అరెస్టు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ముంబైని విడదీయడమంటే విడాకులు తీసుకున్నంత తేలికేమీ కాదని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి