మారణహోమానికి.. దేశంలోకి అతి భయంకర ఉగ్రవాదులు చొరబాటు.. హై అలెర్ట్

శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:17 IST)
పండుగ సయమంలో దేశంలో మారణహోమం సృష్టించేందుకు అతిభయంకరమైన ఉగ్రవాదులు 12 మంది చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హైఅలెర్ట్ ప్రకటించాయి. 
 
బబ్బర్ ఖల్సా‌కు చెందిన 12 మంది అతి భయంకరమైన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పంజాబ్ రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల 23న అరెస్టైన కమల్‌దీప్ సింగ్ అనే ఉగ్రవాదిని ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన కరుడుగట్టిన 12 మంది బబ్బర్ ఖల్సా ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారత్‌లోకి చొరబడినట్లు అతడు వెల్లడించాడు. వీరు ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి