తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె అని, కూల్ డ్రింక్లో మత్తు పదార్థాలు కలిపి ఈఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కూల్ డ్రింక్ సేవించిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిపై సామూహిక అత్యారానికి పాల్పడి.. నెహ్రూ ప్లేస్ ఫ్లైఓవర్ వద్ద వదిలి వెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాయి స్నేహితుడితో పాటు.. మరో వ్యక్తిని అరెస్టు చేశారు. స్నేహితునితో కలిసి యువతి కారులో బయలుదేరిందని, మార్గమధ్యంలో ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇచ్చారని, అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.