2జీ స్పెక్ట్రమ్ స్కామ్కు సంబంధించిన రూ.200కోట్ల మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఏ రాజా, ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. కాగా, బుధవారం ఉదయం కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్కు కూడా బెయిల్ లభించింది.