ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీపడుతున్న కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈమె ప్రచారంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ విషయం గురించి కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ, నిర్మలా సీతారామన్తో కలిసి గురువారం మీడియాతో మాట్లాడుతూ...
ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రచారం జరిపేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఫిబ్రవరి ఐదో తేది వరకు ప్రతిరోజూ క్రేజీవాల్పై ఐదు ప్రశ్నలు సంధించనున్నట్టు తెలిపారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో నాలుగు ర్యాలీలు నిర్వహిస్తారని, పార్టీ తరపున మొత్తం 250 ఎన్నికల ర్యాలీలు జరుపుతామని రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు.