బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. బుందేల్ఖండ్ ప్రాంతంలోని హమీర్పుర్ జిల్లాకు చెందిన 90 ఏళ్ల ఖిమ్మా అహిర్వార్ అనే వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందిన వృద్ధుడు. ప్రస్తుతం దక్షిణాయన పుణ్యకాలం కావడంతో తన పితృదేవతలకు పిండ ప్రదానం చేసి, స్వగ్రామం దిల్గావ్లోని ఖిమ్మా ప్రాంతంలో ఉన్న మైదానీ బాబా (శివాలయం) ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు.
ఈ హఠాత్పరిణామంతో ఖిన్నులైన ఖిమ్మా కుటుంబ సభ్యులు హాహాకారాలు పెట్టుకుంటూ పరుగులు తీశారు. మరోపక్క, కింద పడిపోయిన ఖిమ్మాను ఆలయంలో ఓ మూల ఉన్న కట్టెల దగ్గరకు ఈడ్చుకొచ్చిన శర్మ.. ఖిమ్మాపై వాటిని పేర్చి నిప్పంటించాడు. ఖిమ్మా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకునేలోగానే ఘాతుకం జరిగిపోయింది. ఈ పరిణామంతో ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు శర్మను బంధించి చితకబాది, పోలీసులకు అప్పగించారు. శర్మపై ఇప్పటికే రౌడీషీట్ ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు.