పెళ్ళిచూపులు కోసం వెళ్తే.. కాదు పొమ్మన్నారు.. అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేశాడు..

గురువారం, 22 సెప్టెంబరు 2016 (13:29 IST)
నేరాలు-ఘోరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యక్తిగత కారణాలు, ఆస్తి వివాదాలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో గుజరాత్‌లో  నేరాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా ఓ యువకుడు పెళ్లిచూపులకంటూ వెళ్లాడు.. కానీ అమ్మాయి వారింట అవమానపరిచారు. దీంతో మా బిడ్డను పెళ్ళి చేసుకునే స్థాయి నీది కాదు పొమ్మన్నారు. దీంతో ఊగిపోయిన ఆ యువకుడు అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే, నగేష్ అనే వ్యక్తి కారులో కిడ్నాప్ చేసిన అమ్మాయికి మత్తు మందు ఇచ్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. మత్తులో ఉన్న ఆమెపై పైశాచికంగా రేప్‌కు పాల్పడ్డాడు. ఆమెకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో భయపడ్డ నగేష్ విషయం బయటకు తెలిస్తే పెళ్లి సంగతి పక్కన పెట్టి జైలుకు వెళ్లాల్సి వస్తుందని గుట్టు చప్పుడు కాకుండా ఆ అమ్మాయిని చంపేశాడు. 
 
ఇంతలో తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు విచారణలో నగేష్ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపినట్లు అంగీకరించాడు.

వెబ్దునియా పై చదవండి