అతడికి 24 ఆమెకి 42 ఏళ్లు, ఇక శృంగార బంధం వద్దన్నందుకు ఆమె గొంతులో పొడిచాడు

గురువారం, 15 జులై 2021 (22:25 IST)
పని చేసుకుంటూ భర్త వెంట వస్తున్న 19 ఏళ్ల యువకుడిపై 37 ఏళ్ల మహిళ మోజు పడింది. ఆమె భర్త లేని సమయంలో ఆ యువకుడితో తన సంబంధాన్ని కొనసాగించింది. అలా ఐదేళ్లు గడిచిపోయాయి. అనారోగ్యంతో ఆమె భర్త మృతి చెందాడు. ఆ యువకుడు భర్తతో కలిసి వచ్చినప్పుడు జనం ఏమీ అనుకోరు కానీ లేనప్పుడు వస్తే నానావిధాలుగా అనుకుంటారనీ, పైగా తనకు పెళ్లీడుకొచ్చిన 17 ఏళ్ల కుమార్తె కూడా వుండటంతో ఇక అతడిని తన ఇంటికి రావద్దని చెప్పేసింది. 
 
అంతే అతడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీలో చోటుచేసుకున్న వివరాలు ఇలా వున్నాయి. 24 ఏళ్ల కృష్ణ తనను దూరం పెడుతున్న 42 ఏళ్ల మహిళ వద్దకు జూన్ 10న సాయంత్రం పూట వెళ్లాడు. ఆమెతో తనను దూరం పెట్టడంపై వాగ్వాదానికి దిగాడు. ఆమె ససేమిరా అతడిని అంగీకరించకపోవడంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. దీనితో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
 
మధ్యాహ్నం తన అత్తను చూడటానికి వెళ్ళిన మహిళ యొక్క 17 ఏళ్ల కుమార్తె, సాయంత్రం పూట ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఆమె తల్లి చనిపోయినట్లు గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్యానా నివాసి అయిన నిందితుడు కృష్ణను జూలై 12న అరెస్టు చేసి అతనిపై హత్య కేసు నమోదు చేశారు. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు