తన ప్రేయసిని వేరు చేసేస్తారనే భయంతో ఓ ప్రేమికుడు తన ప్రేయసికి రోడ్డు పైనే తాళి కట్టేశాడు. ఈ తతంగం తమిళనాడు రాష్ట్రంలోని తంజావురులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అనే ఇద్దరు యువతీ యువకులు అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వెళ్లాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన ఆనంద్.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను వెంట తీసుకుని బస్టాండుకు బయల్దేరాడు. దీంతో దివ్యను వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెను ఎక్కడ దూరం చేసేస్తారనే భయంతోనే ఆనంద్ రోడ్డుపైనే తాళికట్టేశాడు. పోలీసులకు దివ్య బంధువులు ఫిర్యాదు చేసినా మేజర్లు కావడంతో పోలీసులు కౌన్సిలింగ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.