గవర్నర్ ఎదుట తన బలాన్ని నిరూపించుకుని తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని ధీమా వ్యక్తం చేశారు. శశికళకు ధైర్యముంటే ఎమ్మెల్యేలను బయటకు పంపి, గవర్నర్ ఎదుట బలాన్ని నిరూపణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. గురువారం గవర్నర్ చెన్నైకి రానున్న నేపథ్యంలో శశికళ వర్గంతో పోటీపడేందుకు పన్నీర్ సై అంటున్నారు.
పనిలో పనిగా పోయెస్ గార్డెన్ నుంచి చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న శశికళను అక్కడినుంచి తరిమేస్తానని పన్నీర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎప్పుడూ సున్నిత వ్యాఖ్యలకే పరిమితమయ్యే పన్నీర్ నోట ఇలాంటి పదునైన వ్యాఖ్యలు రావడం ఇదే తొలిసారి. పోయెస్ గార్డెన్లో ఉండే హక్కు శశికళకు లేదని, ఆ ఇంటిని అమ్మ స్మారక కేంద్రంగా మారుస్తానని తెలిపారు.