చెన్నై, ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చే నెల 12వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తమిళనాడులోని ముఖ్య పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే జయ మేనకోడలు దీప పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే, అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ టీవీ జయా టీవీలో అధికారికంగా ప్రటించారు.